Thursday, October 29, 2009

 

గాలి వీస్తే ఛార్జింగ్ అయినట్టే...

విద్యుత్ లేకుంటేనేం... పవన విద్యుత్ సాయంతో సెల్ ఫోన్ ఛార్జింగ్ చేసుకోండి అని పిలుపునిస్తున్నారు పాండిచ్చేరి లాస్‌పేట పాలిటెక్నిక్ మహిళా కళాశాల ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ విద్యార్థినులు. ఈ కళాశాలకు చెందిన అష్టలక్ష్మి, ప్రియ, చార్మిరోస్, విజయలక్ష్మి, శ్రీదేవి, తమిళ్ సెల్వి ఒక జట్టుగా ఏర్పడి పవన విద్యుత్ ఆధారంగా పనిచేసే సెల్ ఛార్జర్‌ని కనిపెట్టారు. చాలా చిన్న ఫ్యాన్ జోడించిన మోటార్ ద్వారా ఇది పనిచేస్తుంది. బలంగా గాలి వీచినప్పుడు ఈ ఫ్యాన్ తిరుగుతూండగా ఎలక్ట్రిక్ జనరేటర్ తరహాలో ఈ మోటార్ ఉత్పత్తి చేసే విద్యుచ్ఛక్తితో బ్యాటరీ ఛార్జి సర్క్యూట్ పని చేస్తుంది. దీంతో బ్యాకప్ బ్యాటరీని సులువుగా ఛార్జి చెయ్యవచ్చంటున్నారు ఈ విద్యార్థినులు. ముఖ్యంగా వాహనాల్లో ప్రయాణించేటప్పుడు ఈ పరికరం వైరును సెల్‌కు తగిలించి, దానికి (పరికరానికి) ఎదురుగాలి వీచేలా ఉంచితే ఫ్యాన్ వేగంగా తిరుగుతూ ఛార్జింగ్ చేసేస్తుంది. తొలుత నోకియా సెట్లలోని 3.7 వోల్ట్ బ్యాటరీకి ఛార్జి చేసేలా దీనిని తయారు చేశారు. భవిష్యత్తులో దీని సామర్థ్యం పెంచుతామని విద్యార్థినులు చెప్పారు.

Comments: Post a Comment



<< Home

This page is powered by Blogger. Isn't yours?