Friday, April 28, 2006

 

కోడి రెట్ట నుంచి కరెంటంట...

కాదేది విద్యుదుత్పత్తికి అనర్హమనడంలో తప్పులేదనిపిస్తోంది. ఎందుకంటే పారిశ్రామిక వ్యర్ధాల నుంచి విద్యుదుత్పత్తి అనే అంశంపై గురువారం (28 ఏప్రిల్ 2006) రాష్ట్ర సంప్రదాయేతర ఇంధన వనరుల సంస్థ హైదరాబాదులో నిర్వహించిన సదస్సులో చాలా ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకొచ్చాయి. కోళ్లు విడిచే వ్యర్ధాల (వీటిలో ఊక ఉన్నందున) నుంచి కూడా విద్యుదుత్పత్తి చేయవచ్చని తేలడంతో ఈ తరహా ప్లాంట్లను నెలకొల్పేందుకు ప్రభుత్వ అనుమతి లభించింది. ఈ విద్యుదుత్పత్తి ప్రక్రియలో బయటకొచ్చే బూడిదను ఎరువుగా కూడా వాడుకోవచ్చట. ఇంతే కాదండోయ్... పట్టణ ప్రాంతాల్లోని చెత్త నుంచి కూడా విద్యుదుత్పత్తి చేసే దిశగా ప్లాంట్లను నెలకొల్పేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

Comments: Post a Comment



<< Home

This page is powered by Blogger. Isn't yours?