Saturday, March 25, 2006

 

లక్ష రూపాయల కారు వచ్చేసిందోచ్

లక్ష రూపాయలలోపు ఖరీదు చేసే కారు కోసం జనం ఆత్రుతగా ఎదురు చూస్తుండగా, పారిశ్రామిక సంస్థల వాగ్దానాలు కార్యరూపం దాల్చేలోగా అలాంటి కారును ఓ విద్యార్థి సిద్ధం చేసేశాడు. మధురలోని జిఎల్‌ఎ ఇంజనీరింగ్‌ మరియు టెక్నాలజి కళాశాల విద్యార్థి ప్రదీప్‌ కుమార్‌ రాహి ఈ ఘనకార్యాన్ని సాధించాడు. 525 కిలోల బరువు గల ఈ కారు బ్యాటరీ ఆధారంగా గంటకు సుమారు 66 కిమీ గరిష్ట వేగంతో దూసుకెళుతుంది. పూర్తిగా ఛార్జిలో ఉన్నప్పుడు 110 కిలోమీటర్ల మైలేజినివ్వగలదు. ప్రదీప్‌ ఇచ్చిన వివరాల ప్రకారం కిలో మీటరుకు 37 పైసలు మాత్రమే ఖర్చవుతుంది. తమ విద్యార్థి రూపొందించిన ఈ కారును వాణిజ్య విక్రయాలకు సిద్ధం చేయాలనుకుంటే చేయూతనిస్తామని కళాశాల యాజమాన్యం తెలిపింది.

Comments: Post a Comment



<< Home

This page is powered by Blogger. Isn't yours?